Saturday, April 27, 2024

సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో గ్యాస్ లీక్.. కార్మికులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

కొమురంభీం ఆసిఫాబాద్: జిల్లాలో కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఓ కార్మికుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తోటి కార్మికులు హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ రోజు తెల్లవారుజామున క్లోరిన్ గ్యాస్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం తక్షణమే మరమత్తులు చేయించింది. గ్యాస్ లీకయ్యిన సమయంలో పరిశ్రమలో 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. కాగా, విశాఖపట్నంలో స్టైరీన్ గ్యాస్ లీక్ అయి చుట్టు ప్రక్కల గ్రామాల్లోకి వ్యాపించడంతో 12 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Chlorine Gas Leak in Kagaznagar Sirpur Paper Mill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News