Friday, April 26, 2024

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌..

- Advertisement -
- Advertisement -

లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో ఓ ఎస్పి, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుల్‌లు మృతి చెందారు. దీంతో పోలీసులు 25 ప్రత్యేక బృందాలుగా విడిపోయి నింధితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో వికాస్ ప్రధాన అనుచరుడు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న యూపి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు  బుధవారం ఉదయం అక్కడకు వెళ్లగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో అమర్ దూబే చనిపోయినట్లు రాష్ట్ర అదనపు డిజిపి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రధాన నింధితుడు వికాస్ దూబే కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Close aide of Vikas Dubey killed in encounter in Hamirpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News