Monday, May 13, 2024

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ నాలుగు రోజలపాటు ఢిల్లీలో ఉండనున్నారు. సిఎం కెసిఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపిలు, అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వచ్చే యాసంగిలో పంట కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరనున్నారు. వరి కొనుగోలు తోపాటు జలవివాదం, విద్యుత్ చట్టం వంటి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సిఎం కెసిఆర్ భేటీ కానున్నారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తానని ఇప్పటికే సిఎం కెసిఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

CM KCR Going to Delhi Tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News