సిఎం కెసిఆర్ సారథ్యంలో తెలుగు మరింత వికసిస్తుంది
ట్విట్టర్లో ఎంపి సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాష పట్ల తన పెదనాన్న, సిఎం కెసిఆర్కు ఎనలేని ప్రేమ ఉందని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వేల పుస్తకాలు ఆవపోశన పట్టిన కెసిఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో రాష్ట్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడిన సిఎం కెసిఆర్ ప్రసంగం వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వేల పుస్తకాలు ఆపోశన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారథ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు అంటూ ఎంపి సంతోష్కుమార్ ట్వీట్ చేశారు.
వేల పుస్తకాలు ఔపోసన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారధ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు.#తెలుగుభాషాదినోత్సవం శుభాకాంక్షలు.@MVenkaiahNaidu pic.twitter.com/5Vk2p07ejF
— Santosh Kumar J (@MPsantoshtrs) August 29, 2021