Monday, April 29, 2024

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సిఎం కెసిఆర్ సమావేశం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం జస్టిస్ అలోక్ అరాధేతో సమావేశమైన సీఎం కెసిఆర్, రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో మౌలికవసతుల కల్పన, సంబంధిత అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్యామ్ కోషీ, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి, లా సెక్రటరీ తిరుపతి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News