Friday, April 26, 2024

మాజీ డిజిపి మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns death of former DGP Prasada Rao

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి బి. ప్రసాదరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ప్రసాదరావు కుటుంబసభ్యలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. మాజీ డిజిపి బయ్యారపు ప్రసాదరావు అమెరికాలో గుండెపోటులో  కన్నుమూశారు. అర్ధరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రసాదరావుకు భార్య, కుమారుడు, కొడలు ఉన్నారు. ప్రసాదరావు 1979వ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి. ఆయన వయసు 65 ఏళ్లు. ఆయన స్వస్థలం విజయవాడ. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

CM KCR mourns death of former DGP Prasada Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News