హైదరాబాద్: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమతం రాంరెడ్డి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు పరిగి ఎంఎల్ఎగా గెలుపొందారు. 1968లో కాంగ్రెస్ పార్టీ చీఫ్విప్గా ఉన్నారు. 1977లో వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
CM KCR mourns death of former minister Kamath Ram reddy