Monday, May 6, 2024

58 ఏండ్ల త‌ర్వాత బిఆర్ఎస్ సాధించిన విజ‌యం ఇది

- Advertisement -
- Advertisement -

బోధన్ : తెలంగాణ వచ్చినంక నిజాంసాగ‌ర్‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. పాత నిజాంసాగ‌ర్ ఎట్లుండెనో ఇప్పుడు సాగ‌ర్ అలా త‌యారైందన్నారు. నిజాం సాగ‌ర్ 365 రోజులు నిండే ఉంట‌దన్న సిఎం మీ పంట‌ల‌కు ఎటువండి డోఖా ఉండ‌దని భరోసా ఇచ్చారుజ దాన్ని కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లింక్ చేసుకున్నామని తెలిపారు. సింగూరు నీళ్ల‌ను హైద‌రాబాద్‌కు బంద్ చేసి, హైద‌రాబాద్‌కు గోదావ‌రి నుంచి నీళ్లు తెచ్చామన్నారు. కాళేశ్వ‌రం జ‌లాలు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాలు మీకు వ‌స్తాయన్నారు. పాత నిజామాబాద్ ఎలా క‌ళ‌క‌ళ‌లాడిందో మ‌ళ్లా అట్ల‌నే ఉంటుంది. 58 ఏండ్ల త‌ర్వాత బిఆర్ఎస్ సాధించిన విజ‌యం ఇది అని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News