Wednesday, May 15, 2024

21న నియంత్రిత పంటల సాగుపై సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM KCR Review on Controlled Cultivation on 21st

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై ఈ నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరు కానున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది.

మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలని అనే అంశంపై మంత్రి చర్చించనున్నారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి..? అనే అంశాలను ఖరారు చేయనున్నారు. జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను అధికారులు రూపొందించనున్నారు. ఈ పంటల మ్యాప్‌పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పంటలు ఇలా వేద్దాం

70 లక్షల ఎకరాల్లో పత్తి, వరి 40 లక్షల ఎకరాల్లో(తెలంగాణ సోనా 10 లక్షల ఎకరాలు), కంది 15 లక్షల ఎకరాల్లో, కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో, పసుపు 1.20 లక్షల ఎకరాల్లో, మిర్చి 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. యాసంగిలో మాత్రమే మక్కలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News