Saturday, May 11, 2024

చెరువులో మునిగి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in drowning in Pond

 

మనతెలంగాణ/భద్రద్రికొత్తగూడెం : ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు (45) తన కొడుకు తేజు (20), మేనల్లుడు వినయ్ (19)తో కలిసి మంగళవారం పొలంలో కూరగాయల పంటకు పురుగుల మందు పిచికారి చేశారు. అనంతరం పక్కనే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లుకడుక్కునేందుకు వెళ్లారు .ఈ క్రమంలో తేజు చెరువులోకి దిగగా కాలు జారి మునిగిపోయాడు. తేజును కాపాడేందుకు వినయ్ చెరువులోకి దిగాడు.

ఇద్దరు మునిగిపోతుండగా వారిని రక్షించేందుకు అప్పారావు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో చెరువులో మునిగి ముగ్గురు మృతిచెందారు. గ్రామ ప్రజలు వీరి మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాన్ని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు జడ్‌పిటిసి కామిరెడ్డి శ్రీలత, కొండారెడ్డి, బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీష్, శ్రీహరిబాబు, పాలెం దివాకర్‌రెడ్డి, చింతా వెంకట్రామిరెడ్డి, రాజా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News