- Advertisement -
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 4గంటలకు రాష్ట్ర కేబినేట్ సమావేశం భేటీ కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ మీటింగ్ లో పలు నూతన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల చెబుతున్నాయి. త్వరలో తెలంగాణ సర్కార్ చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తెలుస్తోంది.
CM KCR To Hold Cabinet Meeting At Pragathi Bhavan
- Advertisement -