- Advertisement -
జగ్గయ్యపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావ, బ్రదర్ అనిల్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అనిల్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. అయితే కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు డ్రైవర్, గన్ మెన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
brother anil kumar car met with accident in jaggayyapet
- Advertisement -