Sunday, May 12, 2024

ఆ గనుల వేలాన్ని ఆపండి

- Advertisement -
- Advertisement -

CM KCR's letter to Modi over Coal block auction

కేంద్ర బొగ్గు శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 బొగ్గు బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలి : ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ

వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు నేటి నుంచి మూడు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సిఎం లేఖ, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన దృష్ట్యా నిరంతర బొగ్గు సరఫరా అవసరం, కేంద్ర బొగ్గు శాఖ తలపెట్టిన 4 బ్లాక్‌ల వేలం బొగ్గు అవసరాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది, అందుచేత వేలం నిలిపివేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ప్రధానికి, సిఎం కెసిఆర్ ఒక లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకభూమిక పోషిస్తున్నదని ఆ లేఖలో సిఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు.

సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందన్నారు. దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందన్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేయదలిచిన జెబిఆర్‌ఒసి…-3, శ్రావన్ పల్లి ఒసి, కోయగూడెం ఒసి..-3, కెకె -6 యుజి బ్లాక్ ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాటి వేలాన్ని నిలిపివేయమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించవలసిందిగా సిఎం కెసిఆర్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు. ఈ బ్లాక్ లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News