Saturday, April 27, 2024

సిఎం అయ్యాక.. తొలిసారి కొడంగ‌ల్‌కు రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి కొడంగల్ కు వెళ్లనున్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సిఎం శంఖుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు.

ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్నారు. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News