Tuesday, April 30, 2024

జూన్ 28న ప్యారిస్‌కు ఎపి సిఎం జగన్‌

- Advertisement -
- Advertisement -

CM YS Jagan to visit Paris on June 28

అమరావతి: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 28న ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఎపి సీఎంవో తెలియజేసింది. జగన్‌ 28న రాత్రి బయలుదేరి 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తర్వాత జులై 2న తిరుగు ప్రయాణం అవుతారని సిఎంవో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News