Monday, May 6, 2024

అలీ నిర్మాతగా సినిమా షురూ..

- Advertisement -
- Advertisement -

అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అలీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్వీకృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా.. ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. జీవిత రాజశేఖర్, తనికెళ్ల భరణి, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “మంచి కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాలో అలీ, నరేష్ కలిసి నటిస్తుండడం విశేషం. భవిష్యత్తులో వీరు మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. అలీ మాట్లాడుతూ..“ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము. మలయాళం బ్లాక్ బస్టర్ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్.

ఈ కథ నచ్చి వెంటనే సినిమా చూడాలని నరేష్‌కి చెప్పాను. ఆయనకు కూడా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను”అని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ..“అలీ సినిమా చేస్తున్నాడంటే సినిమాకు ఒక బ్రాండ్ వస్తుంది. మేమిద్దరం కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాము. దర్శకుడు శ్రీపురం కిరణ్ మంచి మార్పులు చేసి బెస్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు”అని పేర్కొన్నారు. దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ “అలీ స్థాపించిన ‘అలీవుడ్ బ్యానర్’లో నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. నరేష్ మా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది”అని తెలిపారు. మౌర్యానీ, పవిత్ర లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపిః ఎస్.మురళిమోహన్ రెడ్డి, సంగీతంః రాకేశ్ పళిడమ్, పాటలుః భాస్కరభట్ల రవికుమార్, ఎడిటర్‌ః సెల్వకుమార్.

Comedian Ali Launches his Production Production

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News