Monday, April 29, 2024

కంపెనీలు కుమ్మక్కై స్టీల్, సిమెంట్ ధరలు పెంచేస్తున్నాయి: నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేకపోవడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీలో భారత జాతీయ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇబ్బందులు ఎదుర్కొంటోందని రోడ్డు రవాణా, జాతీయ రహదారల మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన టెక్నాలజీల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్2023ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

స్టీల్, సిమెంట్ పరిశ్రమల్లో దిగ్గజాలు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచుతున్నారని మండి పడ్డారు. డీపీఆర్‌లు సిద్దం చేయడంలో ఎన్‌హెచ్‌ఎఐకి ప్రధాన సమస్యగా మారిందని , ఏ ప్రాజెక్టుకూ సరైన డీపీఆర్ లేదని చెప్పారు. డీపీఆర్‌లు రూపొందించే కంపెనీలు నూతన టెక్నాలజీ, పరిశోధనని అంగీకరించడం లేదని, డీపీఆర్‌ల ప్రమాణాలు కూడా పడిపోయాయని అన్నారు. చైనాలో రవాణా వ్యయం 810 శాతం ఉంటే భారత్‌లో ఇది 1416 శాతంగా ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News