Monday, April 29, 2024

పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం

- Advertisement -
- Advertisement -

కీసర: పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వ హించడం అభినందనీయమని నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నాగారం ప్రభుత్వ పాఠశాలలో నాగారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో టెస్లా డయాగ్నొస్టిక్, బాలజీ హాస్పిటల్, సివిల్ టెక్ ల్యాబ్ సౌజన్యంతో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు.

ఛైర్మన్ చంద్రారెడ్డి వైద్య శిభిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కుల సంఘాలు సమాజ సేవలో ముదుండాలని అన్నా రు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి బపి. షుగర్ పరీక్షలతో పా టు సాధారణ, ఆర్థోఫిడిక్, న్యూరో సర్జన్ వైద్యులతో పరీక్షలు నిర్వ హించి మందులు అందజేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లేష్ యా దవ్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిట్టిమల్ల గణేష్, నాగారం అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు, సంఘం రాష్ట్ర మీడియా అధ్యక్షులు బొమ్మ అమరేందర్, రాష్ట్ర నాయకులు రంగుల శంకర్, డా.కూరపాటి రాజేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News