Saturday, April 27, 2024

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంఎల్ఎ రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

Conflict between Minister Jagadish Reddy and MLA Rajagopal Reddy

 

యాదాద్రి భువనగిరి: రేషన్​కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంఎల్ఎ రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండలం లక్కారంలో రేషన్‌కార్డుల పంపిణీలో రాజగోపాల్‌రెడ్డి రభస చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి చేతిలో నుంచి మైకు లాగేశారు. మంత్రి, ఎంఎల్ఎ అనుచరుల మధ్య పరస్పర తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News