రాహుల్ను అడ్డుకుటే కాంగ్రెస్ నాశనమే
శివసేన ఎంపి సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై సాగుతున్న చర్చ నేపథ్యంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సరితూగే స్థాయి కలిగిన నేత కాంగ్రెస్లో లేరని రౌత్ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపి విస్మయం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్ వ్యాఖ్యానించారు.
Cong will destroy if stopping Rahul: MP Sanjay Raut