Saturday, April 27, 2024

కాంగ్రెస్ లో సీట్ల సర్దుబాటు కోసం ఫోర్‌మెన్ కమిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటు నేతల మధ్య సయోధ్య కోసం ఫోర్‌మెన్ కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన ఫోర్‌మెన్ కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మాణిక్ రావ్ ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లు ఉన్నారు. కాంగ్రెస ఫోర్‌మెన్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. అసంతృప్తులుగా ఉన్న నియోజకవర్గాలపై ఫోర్‌కమిటీ సమీక్ష చేయనుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేలతో బస్సు యాత్ర నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే బిఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్, బిజెపిలు అభ్యర్థులను ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News