Saturday, April 27, 2024

భార్యకు శిరోముండనం చేసిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్యపై అనుమానంతో ఆమెకు భర్త శిరోముండనం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా భార్య మహాలక్ష్మి రూ.2.5లక్షల అప్పు చేసింది. డబ్బిచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చిఆమెతో గొడవకు దిగారు. దీంతో భార్య పై అనుమానంతో ఆ డబ్బు ఏ ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. గుండు గీసి  హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News