- Advertisement -
అయోధ్య : అయోధ్యలో రామాలయ నిర్మాణం ఈ నెల 10న ప్రారంభం కానున్నదని ఆలయ ట్రస్టుకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. ఆరోజు బుధవారం పునాది నిర్మాణానికి మొదటి ఇటుకలతో శిలాన్యాసం చేస్తారని చెప్పారు. గత ఏడాది నవంబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రామజన్మభూమి ప్రదేశంలో కుబేర్ తిల క్షేత్రంలో శివారాధనతో ఈ కార్యక్రమం ప్రారంభమౌతుందని తెలిపారు. మహంత్ నృత్య గోపాల్ దాస్ తరఫున కమల్నయన్ దాస్, ఇతర పూజార్లు ఈ ఆరాధన ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు.
- Advertisement -