Wednesday, May 1, 2024

తగ్గిన కేసులు, మరణాలు

- Advertisement -
- Advertisement -

Corona cases in country are declining day by day

 

24 గంటల్లో 10,064 కేసులు
137 మరణాలు, డెత్ రేట్ 1.44 శాతం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొత్తగా 10,064 కేసులు, 137మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య 8 నెలల కనిష్ఠానికి చేరుకున్నది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837 కాగా, కోలుకున్నవారి సంఖ్య 1,02,28,753, చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,00,528, మొత్తం మరణాల సంఖ్య 1,52,556గా నమోదైంది. దీంతో, రికవరీ రేట్ 96.66 శాతంగా, మరణాల రేట్ 1.44 శాతంగా రికార్డయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.90 శాతం మాత్రమే. 24 గంటల్లో 7,09,791 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 18,78,02,827కు చేరుకున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News