- Advertisement -
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా టెస్టు చేస్తే నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని, తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందన్నారు. కరోనా కట్టడయ్యే వరకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రబెల్లి సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకడంతో అతడికి కరోనా టెస్టు చేశారు.
- Advertisement -