Monday, May 6, 2024

కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు: ఈటెల

- Advertisement -
- Advertisement -

Politics on corona treatment at telangana

 

నిజామాబాద్: కరోనాపై చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వైద్య శాఖ అధికారులతో మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షలు జరిపారు. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. కోవిడ్‌ను అరికట్టడంతలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తోందని, మన దేశంలో కేవలం మూడు శాతమే కోవిడ్ మరణాలు రేటు ఉందని, తెలంగాణలో కోవిడ్ మరణాల రేటు ఒక శాతానికే పరిమితమైందన్నారు. అవసరమైన వైద్యులు, నర్సులు, శానిటైషన్ వర్కర్లను నియమించుకోవాలని ఆదేశించారు. బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసియు బెడ్‌లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News