Tuesday, May 21, 2024

24 గంటల్లో కరోనాతో 1209 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 36551 మంది కరోనా వైరస్ సోకగా 1209 మంది మృత్యువాతపడ్డారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 45.62 లక్షలకు చేరుకోగా 76,271 మంది చనిపోయారు. కరోనా నుంచి 35.42 లక్షల మంది కోలుకోగా 9.43 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత్‌లో మహా నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 11.63 లక్షల మందికి పరీక్షలు చేయగా మొత్తం పరీక్షల సంఖ్య 5.41 కోట్లకు చేరుకుంది. కరోనా కేసుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉండగా అమెరికా (65.88 లక్షలు) మొదటి స్థానంలో ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News