Monday, April 29, 2024

దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది: పరకాల ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశం అత్యంత సంక్షోభంలో ఉందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిరుద్యోగం, ధరల పెరుగదల ఇప్పుడే అధికంగా ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్ భర్త పరకాల కేంద్ర ప్రభుత్వంపై సంచనలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ’సంక్షోభంలో మన గణతంత్రం – విశ్లేషణ’ అనే అంశంపై ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ) సంస్థ నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడారు.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దేశంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్లు ఎంతమంది..? ఈ దేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మోదీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మన దేశంలో 25శాతం జనాభా పౌష్టికాహారం లేక బలహీనమైపోతున్నారన్నారని తెలిపారు. భారత్‌లో చైనా చొరబడినా, శవాలు గంగా నదిలో తేలినా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, నిరుద్యోగం తాండవిల్లుతున్నా.. ఇవేమీ పట్టించుకోకుండా మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా భావజాలం పెరిగిపోతుందన్నారు. ఈ దేశం మతం మత్తులో ఊగుతోందన్నారు. భారతదేశాన్ని ఇంకో పాకిస్థాన్ చేయాలంటే.. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు రెండు నిమిషాలు పట్టేదికాదు” అని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News