Friday, April 26, 2024

దంపతుల ప్రాణం తీసిన గొడవ

- Advertisement -
- Advertisement -

Couple commit suicide in Jagtial

జగిత్యాల: చిన్న గొడవ దంపతుల ప్రాణం తీసిన సంఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నాచుపల్లి గ్రామంలో బత్తిని దేవయ్య-ప్రమీల దంపతులు నివసిస్తున్నారు. గత కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు దంపతులకు నచ్చజెప్పి కాపురం చేయాలని సూచించారు. శుక్రవారం ఉదయం ఇద్దరు మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త చంపేశాడు. అనంతరం దేవయ్య ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ, ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News