- Advertisement -
ముంబై: బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన చరాస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు గాను మాల్యా చరాస్తులను విక్రయించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆధ్వర్యంలోని 15 బ్యాంకుల కన్సార్టియానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ చరాస్తులలో 2016లో పిఎంఎల్ఎ(మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం) కింద జప్తు చేసిన యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్(యుబిహెచ్ఎల్) షేర్లు వంటి సెక్యూరిటీలు ఉన్నాయి. మాల్యాను నేరస్తుడిగా ప్రకటించిన తర్వాత ఆయన చరాస్తుల జప్తునకు కోర్టు అనుమతిచ్చింది.
Court allows banks to use assets seized from Mallya
- Advertisement -