Monday, April 29, 2024

కరోనా బాధితులను ఇంట్లో పెట్టి తాళం వేశారు

- Advertisement -
- Advertisement -

Covid couple locked in their house at nellore

అమరావతి: నెల్లూరు జిల్లాలో మానవత్వం మంటగలిసిన సంఘటన చోటు చేసుకుంది. నవాబ్‌పేట్‌లోని ఓ అపార్ట్ మెంట్ లో కుటుంబ సభ్యులకు కోవిడ్-19 సోకింది. కరోనా బాధితుల ఫ్లాట్ లో నుంచి బయటకు రాకుండా అపార్ట్ మెంట్ వాసులు తాళం వేశారు. తమకు కూడా కరోనా సోకుతుందని అపార్ట్ మెంట్ వాసులు అమానుషంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. కరోనా బాధితులు మందుల కోసం బయటకు వెళ్లారు. బాధితులు బయటకు రావడానికి వీల్లేదని అపార్ట్ మెంట్ వాసులు చెప్పారు. సమాచారం కాస్త పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని ఫ్లాట్ కు వేసిన తాళాన్ని తీశారు. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

 

Covid couple locked in their house at nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News