Wednesday, May 15, 2024

నటరాజన్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Covid positive for T Natarajan

 

దుబాయి: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్‌కు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో నటరాజన్‌తో సన్నిహితంగా మెలిగిన ఆరుగురుని ఐసోలేషన్‌కు తరలించారు. వారిలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పి.గణేశన్ ఉన్నారు. ఇక జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి బుధవారం ఉదయం ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అందరికి నెగెటివ్ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

ఇక బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగింది. మరోవైపు కరోనా కారణంగా భారత్ వేదికగా జరిగిన ఐపిఎల్‌ను మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. అప్పుడూ కూడా పలువురు హైదరాబాద్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐపిఎల్ టోర్నీ మధ్యలోనే ఆగిపోయింది. ఇక యుఎఇ వేదికగా ఈ ఆదివారం రెండో దశ టోర్నమెంట్ ఆరంభమైంది. ఇక ఆరంభంలోనే సన్‌రైజర్స్ జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. దీంతో టోర్నమెంట్ నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. కానీ ఒక్క నజరాజన్‌కు మాత్రమే కరోనా ఉన్నట్టు తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News