- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(సిపిజిఇటి) దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సిపిజిఇటి కన్వీనర్ ఎన్.కిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుంతో వచ్చే నెల 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 6వ తేదీ నుంచి సిపిజిఇటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
- Advertisement -