- Advertisement -
ఢాకా: దుర్గా పూజల సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా బహుమతులు పంపించారు. ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక నిబంధనల ప్రకారం కోల్కతాలోని దౌత్య కార్యాలయం ద్వారా మమతకు వాటిని చేరవేసినట్టు అధికారులు తెలిపారు. అయితే, మమతకు పంపిన బహుమతులు ఏమిటన్నది అధికారికంగా వెల్లడించలేదు. చీర, మిఠాయిలు, పూలు పంపినట్టుగా భావిస్తున్నారు.
- Advertisement -