Monday, April 29, 2024

కృష్ణా నదిలో వలలో చిక్కుకొని మొసలి మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో చేపల వలకు చిక్కుకొని మొసలి మృతి చెందింది. మద్దిమడుగు అటవీ రేంజ్ పరిధిలోని కృష్ణా నదిలో చేపల కోసం జాలర్లు వల విసిరారు. ఈ వలలో మొసలి చిక్కుకొని చనిపోయింది. అటవీ శాఖ అధికారులు మొసలి కళేబరాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. చేపలు పట్టడానికి నదిలోకి ఎవరు వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News