Monday, April 29, 2024

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామి వారి దర్శనార్ధం కొద్ది రోజులుగా భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగినప్పటికీ ఆదివారం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భ క్తులు రద్దీ పెరిగింది. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజా కైంకర్యాలు ప్రారంభించారు.

ఉదయం అష్టోత్తరం, అభిషేకం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చనతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజ, సాయ ంత్రం వెండి జోడి మొ క్కు సేవలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు దర్శనం క్యూలైన్లు, ప్రసాద క్యూ లైన్లు, నిత్యకల్యాణం, కల్యాణకట్టలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న భక్తులు కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. యాదాద్రి అనుబంధ క్షేత్రమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ.34,23,679 ఆదాయం వచ్చినట్టు ఆల య అ ధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.14,32, 170, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,54,050, వీఐపీ దర్శనం ద్వారా రూ.4,50,000, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,43,200, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.4,00,000తో పాటు వివిధ శా ఖల నుంచి ఆలయానికి నిత్యరాబడి సమకూరినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News