Thursday, May 9, 2024

కెసిఆర్ సేవా దళం ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్

- Advertisement -
- Advertisement -

Day and Night Cricket Tournament under auspices of KCR Seva dalam

 

ఫిబ్రవరి 05వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాసబ్‌ట్యాంక్ హాకీ మైదానంలో
టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ సేవా దళం ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. నేడు ఈ టోర్నమెంట్‌కు సంబంధించి క్రికెట్ ట్రోపీ బ్రోచర్‌ను విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 05వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాసబ్‌ట్యాంక్ హాకీ మైదానంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన టీంలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ క్రికెట్ టీంల వివరాలను నేటి నుంచి ఫిబ్రవరి 04వ తేదీ వరకు బాబుఖాన్ ఎస్టేట్‌లోని కెసిఆర్ సేవా దళం కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చన్నారు. ఈ ట్రోపిలో గెలిచిన మొదటి విజేతకు లక్ష, రన్నరప్‌కు రూ.50 వేలను ప్రైజ్ మనీ కింద అందించనున్నట్టు ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News