Saturday, April 27, 2024

ఆగస్టు 19న ‘మహా సముద్రం’

- Advertisement -
- Advertisement -

యువ హీరో శర్వానంద్, – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘మహా సముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అదితి రావు హైదరి, – అను ఇమ్మాన్యుయల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచేసేసింది. ఈ క్రమంలో తాజాగా ‘మహాసముద్రం’ రిలీజ్ డేట్‌ని చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని వదిలారు. ఇందులో శర్వానంద్, – సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్‌పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News