Monday, April 29, 2024

సంజ‌య్‌కు ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Death Sentence to Accused Sanjay in Gorrekunta Murders

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో సంచలనం సృష్టించిన 9మంది సామూహిక హత్యల కేసులో దోషికి వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులు సంజయ్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ ఈ ఏడాది మే 21తేదీన తొమ్మిది మందికి మత్తుమందు ఇచ్చి వారు స్ప్రహ కోల్పోయిన తర్వాత వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జలసమాది చేశారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింది కేసులు నమోదు చేసిన పోలీసులు 25రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారణ త్వరగా పూర్తిఅయింది. ఈ కేసులో 57మంది వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 20ఏండ్ల క్రితం బెంగాల్ నుంచి మక్సూద్ కుటుంబం వరంగల్ కు వలస వచ్చింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు నిందితుడు తొమ్మిది హత్యలు చేసినట్టు విచారణలో తెలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News