- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యా కోర్సుల డిగ్రీ, పిజి సెమిస్టర్ పరీక్షలను వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని జెఎన్టియుహెచ్ ప్రకటించింది. పరీక్షల తేదీలకు సంబంధించిన సమాచారం కోసం వార్తా పత్రికలు, వార్తా ఛానళ్తతోపాటు తమ వర్సిటీ వెబ్సైట్ చూడాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఎ.గోవర్ధన్ పేర్కొన్నారు. యుజి, పిజి పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల పదవ తరగతి పరీక్షలపై నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతించిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని జెఎన్టియుహెచ్ నిర్ణయించింది.
- Advertisement -