- Advertisement -
చెన్నై: బంగాళాఖాతంలో నైరుతి దిశలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. కాగా భారత వాతావరణ శాఖ చెన్నైకు ప్రకటించిన రెడ్ అలర్ట్ను ఉపసంహరించుకుంది. కానీ ఆరెంజ్ అలర్ట్ ను మాత్రం జారీ చేసింది. చైన్నై, దాని పరిసర జిల్లాల్లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువ ఉందని పేర్కొంది. ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం అంతర్గత మంత్రుల కేంద్ర బృందంను తమిళనాడుకు వెళ్లి అక్కడ వరద పరిస్థితులు, దానీ తీవ్రతను అంచనావేయమని, ఆ రాష్ట్రానికి అదనపు కేంద్ర సహాయంకు తుది సిఫార్సులను చేయాల్సిందిగా ఆదేశించింది.
- Advertisement -