Thursday, May 16, 2024

ఆ జాబితాలో నేనుంటానా లేదా అనేది ముఖ్యం కాదు: ధోనీ

- Advertisement -
- Advertisement -

 తొలి రిటెన్షన్ కార్డును మహీ కోసమే ఉపయోగిస్తాం
 చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టీకరణ

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. వచ్చే ఏడాది కూడా మహీ జట్టులోనే కొనసాగుతాడని ఆ జట్టు ప్రతినిధి తాజాగా మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా ఐపిఎల్ టోర్నీలో చేరనున్న నేపథ్యంలో ఈ సారి మెగా వేలం నిర్వహించనున్నారు. అయితే పాత జట్లు పలువురు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలు కల్పించడంతో చెన్నై తొలి రిటెన్షన్ కార్డును ధోనీ కోసమే ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. దీంతో ధోనీ వచ్చే ఏడాది కూడా చెన్నై జట్టు తరఫున ఉంటాడని అర్థమవుతోంది. మరో వైపు కోల్‌కతాతో తుదిపోరులో విజయం అనంతరం ధోనీ మాట్లాడుతూ తన భవితవ్యంపైనా స్పందించాడు.

చెన్నై తరఫున ఆడే అవకాశాలను కొట్టిపారేయలేదు. అయితే ఫ్రాంచైజీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ‘సిఎస్‌కెకు ఏది మంచిదో మేము నిర్ణయించాలి. అది ముగ్గురు కావచ్చు లేదా నలుగురు కావచ్చు. ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అనేది ముఖ్యం కాదు. బలమైన జట్టు ఉండేలా, ఫ్రాంచైజీ ఇబ్బంది పడకుండా చూడడం చాలా ముఖ్యం. వచ్చే వేలంతో రాబోయే పదేళకోసం జట్టును సిద్ధం చేసుకోవాలి. 2008నుంచి చెన్నై ప్రధాన జట్టు పదేళ్లకు పైగా ఉంది. వచ్చే పదేళ్లు కూడా ప్రధాన జట్టుతో ముందుకెళ్లడానికి మేము బాగా కష్టపడాలి’ అని ధోనీ చెప్పాడు.

Dhoni will be play continue in IPL 2022: CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News