Saturday, May 4, 2024

పెద్ద విజయాన్ని అందించారు

- Advertisement -
- Advertisement -

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “నేను ఇప్పటిదాకా బ్లాక్‌బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు ‘డిజె టిల్లు’తో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసింది”అని అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “డిజె టిల్లు కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు”అని చెప్పారు. ఈ సమావేశంలో దర్శకుడు విమల్ కృష్ణ పాల్గొన్నారు.

DJ Tillu Movie Unit Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News