Wednesday, May 8, 2024

మీ అబ్బ జాగీరా?: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం మీ అబ్బ జాగీరా?.. ప్రధాని మోడీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుకను మడత పెట్టి కుట్టేస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ కేటాయించారు, అది మీకు కనిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్ అంతకు మించి ఏమీలేదు.

ప్రధాని మాటలు భరించలేక అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు దళిత బంధు, బిసి బంధు త్వరగా పూర్తి చేయాలని స్వయాన మంత్రి ఎర్రబెల్లి చెబుతున్నారు. లబ్ధిదారుల లిస్ట్ తీసుకోండి.. ఆ లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మంత్రి చెప్పడంలో పథకాల అమలులో వారి చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అరు గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తేనే గెలుస్తామని చెబుతున్నారు. అది వారి నైజమని ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News