Sunday, April 28, 2024

వైద్యులు భగవంతుడితో సమానం: వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

Venkaiah naidu urges Mps to promote mother tongue

ఢిల్లీ: వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవించమని భారతీయ సంస్కృతి చెబుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో  వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరాయంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులందరికీ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నానని ప్రశంసించారు.  కోవిడ్ మహమ్మారి వైద్యులు, వారి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందని, అయినా వారు చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ, వైద్యులపై ఒత్తిడిని తగ్గించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News