Saturday, May 4, 2024

కోళ్ల ఉత్పత్తులపై ఆంక్షలొద్దు

- Advertisement -
- Advertisement -

Don't impose restrictions on Poultry industry products: Giriraj Singh

 

మనుషులకు బర్డ్‌ఫ్లూపై ఆధారాల్లేవు
కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్

న్యూఢిల్లీ: కోళ్ల పరిశ్రమ ఉత్పత్తులపై ఆంక్షలు విధించొద్దని కేంద్ర పశుసంవర్థకశాఖమంత్రి గిరిరాజ్‌సింగ్ రాష్ట్రాలను ఆదేశించారు. మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకుతుందని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ నివేదికలు లేవని ఆయన తెలిపారు. అందువల్ల వినియోగదారులు కూడా భయపడాల్సిన అవసరంలేదని ఆయన సూచించారు. ఢిల్లీసహా ఏ రాష్ట్రంలోనూ కోళ్ల ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెట్లపై ఆంక్షలు విధించొద్దని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ వెలుపలి నుంచి తెచ్చే చికెన్ అమ్మకాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిషేధం ప్రకటించిన నేపథ్యంలో కేంద్రమంత్రి స్పష్టతనిచ్చారు. ఢిల్లీసహా 10 రాష్ట్రాల్లో పక్షుల చావుకు బర్డ్‌ఫ్లూనే కారణమని ఇప్పటికే నిర్ధారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News