Monday, April 29, 2024

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీనన్ మిట్టల్ దోస్త్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం, జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. ఈసారి కొత్తగా దోస్త్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చారు.

అలాగే టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్, మీ సేవా ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కొనసాగనుంది. ట యాప్ ఫేస్ రికగ్ననైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. దోస్త్ రిజిస్ట్రేషన్, ఇతర అంశాలలో విద్యార్థులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ చాట్‌బాట్‌తో పాటు యాప్‌లో కూడా చాట్‌బాట్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైర్మన్ లింబాద్రి తెలిపారు. 7901002200 దోస్త్ వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుందని, అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News