Monday, April 29, 2024

పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్‌రూం ఇళ్లు

- Advertisement -
- Advertisement -

ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

Double bedroom house symbolizes self-respect of poor people
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఓల్డ్ మారేడ్‌పల్లిలో 5.18 ఎకరాలలో ఒక్కొక్కటి 560 స్వేర్ పీట్లతో ఒక్కొక్క యూనిట్ ధర రూ. 7.75 లక్షల ఖర్చుతో మొత్తం రూ.36.27 కోట్ల వ్యయంతో 22 బ్లాక్‌లలో 468 గృహాలను రాష్ట్ర పశుసంవర్దక, పిషరిస్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర కార్మికశాఖ, హోంశాఖ మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ లోకేష్‌కుమార్, కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ సభ్యులు సురభివాణిదేవిలతోకలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ గతంలో హౌసింగ్ శాఖకు సంబంధించిన రూ. 350 కోట్ల విలువగల 5.18 ఎకరాల స్దలాన్ని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసి 468 గృహాలను 22బ్లాక్‌లో నిర్మించి పూర్తిచేసి అర్హులైన లబ్దిదారులు ఒకరూపాయి ఖర్చులేకుండా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు డిగ్నిటీ కాలనీలు దేశంలో ఏరాష్ట్రంలో మరెక్కడా లేవని, మన ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద మనస్సు గల వ్యక్తి కాబట్టి పేదల కోసం ఎంత ఖర్చుయినా పర్వాలేదు కానీ పేదల సొంతింటి కలను నెరవేర్చాలని అన్నారు. రాష్ట్రంలో 18వేల కోట్ల వ్యయంతో 2.72లక్ష రెండు పడకల గదులు గృహాలు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1 లక్ష గృహాలు అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూంలు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు అంటున్నారని తెలిపారు. ఇళ్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అని కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.

కేటాయింపు చేసిన డబుల్ బెడ్‌రూమ్‌లను అమ్మడం గాని, కొనడం చేయవద్దని, కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని పచ్చదనం పెంచుకోవాలన్నారు. అదే విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రసంగిస్తూ రూ. 350కోట్ల విలువగల స్దలం ఒక్కొక్క డబుల్ బెడ్ రూం ఈప్రాంతంలో ఒక కోటి 20లక్షలకు తక్కువగా ఉండదన్నారు. ఈకాలనీ వాసులకు నల్లా బిల్లులు కూడా ఉండవన్నారు. కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నివసించే ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నారని,కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ఇంటికి 20వేల లీటర్ల త్రాగునీరు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఇళ్లు మరెక్కడా లేదని మనస్సున ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక రూపాయి ఖర్చు తీసుకోకుండా ఇండ్లు కట్టిస్తున్నారన్నారు.

వరద నివారణ కోసం రూ. 10 కోట్ల వ్యయంతో హస్మత్‌పేట్ నాలాను బాగు చేస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ శాసనసభ్యులు జి.సాయన్న మాట్లాడుతూ గతంలో ఇక్కడ నివాసం ఉన్న వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తామని అన్నారు. కొంచెం ఆలస్యం అయింది. పేదలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో ఉచితంగా అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రమన్నారు. పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ కె. దీపిక నరేష్, హౌసింగ్ సీఈ సురేష్, కిషన్, విద్యాసాగర్, ఆర్డీవో వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News