Saturday, April 27, 2024

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్..

- Advertisement -
- Advertisement -

 హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నాడు. సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించిన దుల్కర్ సల్మాన్ బుధవారం ఉదయం నగరంలోని కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని దుల్కర్ పిలుపునిచ్చారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ దుల్కర్ సల్మాన్ కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

Dulquer Salman plant saplings at KBR Park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News