Saturday, April 27, 2024

పవన్ కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీయొద్దు: ద్వారంపూడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనం వారాహి కాదని అది నారాహి అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ద్వారంపూడి రీకౌంటర్ ఇచ్చారు. వారాహిపై పవన్ నిత్యం ద్వారంపూడి గురించి జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని మండిపడ్డారు.

Also Read: కుక్కతో పాప బంతి ఆట… వీడియో వైరల్

కాకినాడలో పోటీపై తాను సవాల్ చేస్తే పవన్ తోకముడిచి వెళ్లిపోయారని చురకలంటించారు. పవన్ కాకినాడకు ఉన్న మంచిపేరును చెడగొట్టొద్దని సూచించారు. వ్యక్తిగతంగా పవన్‌తో విభేదాలు ఉంటే ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందామని సవాల్ విసిరారు. అంతేకాని కాకినాడ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దన్నారు. బెస్ట్ లివింగ్ లో కాకినాడ పట్టణం ఒకటిగా ఉందని, కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తే ఊరుకునే సమస్యేలేదని ద్వారంపూడి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News